రాజగోపాల్‌రెడ్డి.. సొంత పనుల కోసం బీజేపీ లో చేరుతున్నాడు : సీతక్క

-

ఎప్పటినుంచో అసమ్మతితో ఉన్న తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఒక్కొక్కరిగా కాంగ్రెస్‌కు రాజీనామాలు చేస్తున్నారు. అయితే నేడు మునుగోడులో కాంగ్రెస్‌ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. ఏ తల్లి ఆశీర్వదిస్తే గెలిచిండో… ఆ తల్లి కష్టాల్లో ఉంటే అమిత్ షా దగ్గర ఉన్నారు రాజగోపాల్ రెడ్డి అంటూ ఆమె ఆరోపించారు. బేరసారాలు ఆడుకుంటున్నాడని, తల్లి గుండె పై తన్ని పోతున్నాడు రాజగోపాల్‌రెడ్డి అంటూ ఆమె మండిపడ్డారు. సొంత పనుల కోసం బీజేపీ లో చేరుతున్నాడు అని ఆమె విమర్శించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ఎలా చెడ్డ పార్టీ అవుతుంది అనేది ఆలోచన చేయాలి ప్రజలు అని ఆమె వ్యాఖ్యానించారు. ఇతర పార్టీ ఎమ్మెల్యే లను కొనుక్కోవడం.. ధరలు పెంచడం… ప్రభుత్వాలు కుల్చడమే బీజేపీ పని అని ఆమె మండిపడ్డారు. తల్లి పాలకు తప్పా.. అన్నిటికీ పన్నులు విధించింది బీజేపీ అని సీతక్క ఆరోపించారు.

Telangana: Seethakka clarifies amid rumours of voting for Murmu

తల్లిని చంపి బిడ్డను ఇచ్చారు అని విమర్శించిన బీజేపీ నీ నిలదీయండన, టీఆర్ఎస్‌..బీజేపీ వచ్చాక..అమ్ముడు..కొనుడు ..దాచుకునుడు అని సీతక్క విమర్శించారు. జైల్ కి పోయి వచ్చిన వాడి దగ్గర పని చేయాలా అంటున్నాడు రాజగోపాల్ రెడ్డి అని, అమిత్ షా హత్య కేసులో జైల్లో ఉండి వచ్చిన వ్యక్తి పక్కన ఎట్లా కుర్చుంటున్నవు అని సీతక్క ప్రశ్నించారు. బీజేపీకి చిత్తశుద్ది ఉంటే.. 2018 లో పోటీ చేసిన నాయకుడికి టికెట్ ఇవ్వాలి. రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి పోగానే టికెట్ కావాలి..పదవి కావాలి. కాంగ్రెస్‌లోకి వచ్చిన వాళ్లకు మాత్రం పదవులు వద్దట అని సీతక్క ధ్వజమెత్తారు.

 

Read more RELATED
Recommended to you

Latest news