కేంద్రాన్ని అడిగే దమ్ము, ధైర్యం రాష్ట్ర బీజేపీ నాయకులకు ఉందా? : ఎమ్మెల్సీ కవిత

-

తెలంగాణకు వచ్చే నిధులపై కేంద్రాన్ని అడిగే దమ్ము, ధైర్యం రాష్ట్ర బీజేపీ నాయకులకు ఉందా? అని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. చత్తీస్‌గఢ్, మధ్య ప్రదేశ్, కర్ణాటక, ఆదిలాబాద్ లో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీని అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం టెండర్లు పిలుస్తోంది. తెలంగాణలో సింగరేణి బొగ్గు గనులు, సిమెంట్ ఫ్యాక్టరీలు అమ్మగా వచ్చిన డబ్బును తెలంగాణ రాష్ట్రం కోసం వినియోగిస్తారా? ఇది అడిగే దమ్ము రాష్ట్ర బీజేపీ నాయకులకు ఉందా? అనినిలదీశారు.

దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్తులను అమ్ముతున్నారు, వాటి ద్వారా వచ్చే డబ్బుతో అసలు ఏం చేయబోతున్నారు అని చెప్పే చిత్తశుద్ది బిజెపి నాయకులకు ఉన్నదా ? అని ప్రశ్నించారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా కొత్త ఫ్యాక్టరీ పెట్టబోతున్నారా ? లేదా ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినటువంటి కాలేశ్వరం లాంటి ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేయబోతున్నారా ? కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తారా ? తెలంగాణ లో ఉన్నటువంటి సింగరేణి బొగ్గు గనులను , ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ మరియు ఇతర ప్రభుత్వరంగ సంస్థలను అమ్మడం ద్వారా మీరు ఏం సాధించాలి అనుకుంటున్నారు ? అని ఎమ్మెల్సీ కవిత ఆగ్రహించారు.

దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి , బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రధానమంత్రిని కలిసి అదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ గురించి చర్చించారు , మంత్రి కేటీఆర్ గారు అనేకమార్లు ఉత్తరాలు కూడా రాయడం జరిగింది, ఎన్నో కుటుంబాలు ఆధార పడ్డ ఫ్యాక్టరీలను మూసివేసి మీరు ప్రజలకు ఏమి సమాధానం చెప్తారని నిలదీశారు ఎమ్మెల్సీ కవిత.

Read more RELATED
Recommended to you

Latest news