కరోనా వ్యాక్సిన్: భారతదేశ మార్కెట్లోకి మోడెర్నా.. మరికొద్ది రోజుల్లో ఫైజర్.

-

భారతదేశ ప్రజలకి మూడు రకాల కరోనా వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ఆస్ట్రాజెనికా తయారు చేసిన కోవిషీల్డ్, భారత్ బయోటెక్ రూపొందించిన కోవ్యాక్సిన్, ఇంకా రష్యా నుండి దిగుమతి చేసుకున్న స్పుత్నిక్ వి. ఈ మూడు వ్యాక్సిన్లు కరోనా నుండి కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా మరో వ్యాక్సిన్ కి భారత ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. మోడెర్నా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ ఇండియాకి రానుంది. ఈ మేరకు నీతీ ఆయోగ్ ఆరోగ్య మెంబరు వీకే పాల్ తెలియజేసారు.

భారతదేశానికి చెందిన సిప్లా కంపెనీ, మోడెర్నా కరోనా వ్యాక్సిన్ ని అత్యవసర సమయంలో వాడడానికి ఉపయోగించే మందుగా భారతదేశానికి అందిస్తుంది. ఈ మేరకు అనుమతులు వచ్చాయి. ఐతే ఈ వ్యాక్సిన్ ని ఉపయోగించడానికి అనేక నియమ నిబంధనలు ఉన్నాయి. ఇదిలా ఉంటే, అమెరికాకి చెందిన ఫైజర్ వ్యాక్సిన్ కూడా ఇండియాలోకి రానుందని తెలుస్తుంది. మోడెర్నా వచ్చిన కొద్ది రోజుల తర్వాత ఫైజర్ కూడా వస్తుందని అధికారులు తెలియజేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news