2047 నాటికి ఇండియాను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలి -ప్రధాని మోడీ

-

2047 నాటికి ఇండియాను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని ప్రధాని మోడీ అన్నారు. దేశవ్యాప్తంగా 76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్య్ర వేడుకల వేదికైన ఎర్రకోటపై ప్రధాని మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ..

భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి అని పునరుద్ఘాటించాం. 75 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం. అమూల్యమైన సామర్థ్యం ఉందని దేశం నిరూపించుకుందన్నారు ప్రధాని మోడీ. త్యాగధనుల పోరాటాల ఫలితమే మన స్వాతంత్య్రమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

మహనీయులు మనకు స్వాతంత్య్రాన్ని అందించారని, బానిస సంకెళ్ల ఛేదనలో వారి పోరాటం అనుపమానమని చెప్పారు. గాంధీజీ, చంద్రబోస్‌, అంబేద్కర్‌ వంటివారు మార్గదర్శకులని వెల్లడించారు.2047 నాటికి 50 ఏళ్లు నిండనున్న యువత, స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్ల నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుతామని ప్రతిజ్ఞ చేయాలని కోరారు. “మేము ప్రమాణం చేసినప్పుడు, మేము దానిని నెరవేరుస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news