మోడీ: కాంగ్రెస్ 2జీ స్కామ్ చేసింది.. బీఆర్ఎస్ నీళ్ల స్కామ్..!

-

కాంగ్రెస్ టూజీ స్కామ్ చేస్తే బీఆర్ఎస్ నీళ్లు స్కామ్ చేశారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు ఈరోజు ఎన్నికల నగారా మోగుతుంది అని నేను టీవీలో చూసానని అన్నారు. ఎన్నికల తేదీలు ప్రకటించక ముందే ఎన్నికల ఫలితాలు ప్రజలు ముందే ప్రకటించారని అన్నారు. నగర్ కర్నూల్ లో జన సముద్రం కనిపిస్తోందని నిన్న సాయంత్రం అద్భుతమైన దృశ్యం మల్కాజిగిరిలో కూడా చూశానని అన్నారు.

బిజెపికి ఆశీర్వాదం ఇస్తున్నారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇక్కడికి వచ్చాను అప్పుడు ప్రజల్లో బీఆర్ఎస్ పైన ఉన్న కోపాన్ని చూసానని చెప్పారు. తెలంగాణ ప్రజలు మోడీని మరోసారి ఆ పీఠంలో కూర్చో పెట్టాలని డిసైడ్ అయ్యారని మోడీ అన్నారు. మోడీ మూడో సారి మోడీ సర్కార్ వస్తుందని అన్నారు గత పదేళ్లలో తెలంగాణ అభివృద్ధి మోడీకి ప్రాధాన్యతగా ఉందన్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో తెలంగాణ ఇరుక్కుపోయింది అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version