2024 ఎన్నికల్లో మోడీ సర్కార్ కు ఓటమి తప్పదు: బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి

-

ప్రధాని మోదీ కి బిజెపి కి చెందిన ప్రముఖ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి షాక్ ఇచ్చారు. 2024 ఎన్నికల్లో మోడీ సర్కార్ కు ఓటమి తప్పదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీలోనే ఉన్నా సుబ్రమణ్యస్వామి చేసే వ్యాఖ్యలు బీజేపీ అగ్రనేతలకు పంటికింద రాయిలా మారాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. “ఇండియా షైనింగ్” తరహాలో మోడీ సర్కార్ కు 2024లో ఓటమి తప్పదని సుబ్రమణ్యస్వామి జోస్యం చెప్పారు.

గతంలో వాజ్ పేయి సారథ్యంలో 2004లో ఇండియా షైనింగ్( భారత్ వెలిగిపోతోంది) అనే నినాదంతో బీజేపీ ఎన్నికలకి వెళ్ళింది. అయితే ఆ పార్టీకి అప్పట్లో ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏకు పట్టం కట్టారు. ఆ తరహా పరిస్థితి 2024లో మోడీ ప్రభుత్వానికి రావచ్చంటూ సుబ్రమణ్యస్వామి వ్యాఖ్యానించారు. ఆర్థిక అభివృద్ధి సాధించడంలో మోడీ సర్కారు 8 ఏళ్ల పాలనలో ఘోర వైఫల్యం చెందిందన్నారు. 2004లో మాదిరిగానే మోడీ సర్కారు కూడా వచ్చే ఎన్నికల్లో కుప్పకూలడం ఖాయం అని ఆయన అభిప్రాయపడ్డారు. బీజేపీకి చెందిన ప్రముఖ ఎంపీ కావడంతో ఆయన వ్యాఖ్యలు ప్రతిపక్షాలకు అస్త్రంలా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news