Breaking : దేశ అభివృద్ధే మాకు ముఖ్యం : మోడీ

-

కర్ణాటక యాద్గిర్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు ప్రధాని మోడీ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో (కేంద్రం, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం) అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. దేశ అభివృద్ధే తమకు ముఖ్యమని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. వచ్చే 25 ఏళ్లలో దేశానికి, దేశంలోని ప్రతి పౌరుడికి అమృత కాలమని.. ఈ సమయంలోనే దేశాన్ని అభివృద్ధి చెందిన భారత్ గా నిర్మించుకోవాలని అన్నారు ప్రధాని మోడీ. పరిశ్రమలను విస్తరించడం, మంచి పంటలను పండించడం వంటి కార్యక్రమాల ద్వారానే మన దేశం అభివృద్ధి చెందుతుందని ప్రధాని మోడీ చెప్పారు.

Muzaffarpur: Prime Minister Narendra Modi addresses during a BJP rally in Bihar’s Muzaffarpur on April 30, 2019. (Photo: IANS)

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికి దేశంలో కేవలం 3 కోట్ల ఇళ్లకు మాత్రమే కుళాయి ద్వారా నీళ్లు వచ్చేవని… ఇప్పుడు 11 కోట్ల ఇళ్లకు అందుతున్నాయిని తెలిపారు ప్రధాని మోడీ. కర్ణాటక అసెంబ్లీకి ఈ ఏడాది మే నెల లోపల ఎన్నికలు వస్తాయని ప్రధాని మోడీ చెప్పారు. కర్ణాటకలో 224 అసెబ్లీ స్థానాలు ఉండగా… 150 చోట్ల విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు ప్రధాని మోడీ. బీజేపికి ఓటు బ్యాంకు రాజకీయాలు ముఖ్యం కాదని… ఇలాంటి రాజకీయాలకు బీజేపీ ప్రాధాన్యతను ఇవ్వదని ప్రధాని మోడీ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news