ఎన్నికలు వస్తేనే కెసిఆర్ కు దళితులపై ప్రేమ పుట్టుకొస్తుంది – ఎంపీ లక్ష్మణ్

-

సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బిజెపి రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్. శ్రీరామనవమికి రాముడికి తలంబ్రాలు, పట్టు వస్త్రాలు ఇవ్వలేని సీఎం ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ మాత్రమేనని విమర్శించారు. శనివారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్ పై బిజెపి పాలిత రాష్ట్రాలలో 20 రూపాయలకు పైగా పన్నులు తగ్గిస్తే.. రాష్ట్రంలో కనీసం ఐదు రూపాయలు తగ్గించడానికి ఈ సర్కారుకు మనసు రావడం లేదని ఆరోపించారు.

ఇక ఎన్నికలు వస్తేనే సీఎం కేసీఆర్ కి దళితులపై ఎనలేని ప్రేమ పుట్టుకు వస్తుందని ఎద్దేవా చేశారు. ఎన్నికలు వస్తున్నాయి అనగానే అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నారని, పేదలకు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తామని ఇప్పుడు 3 లక్షలకు తగ్గించారని వండిపడ్డారు. పేదలకు ఇల్లు ఇవ్వడం లేదు కానీ.. ఇతర రాష్ట్రాలలో బిఆర్ఎస్ కార్యాలయాలు మాత్రం పూర్తవుతున్నాయని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news