2024 ఎన్నికల్లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లోకి తేవాలి: ఎంపీ సుమలత

-

ఈ రోజు పార్లమెంట్ లో బీజేపీ ప్రభుత్వం తీసుకు వచ్చిన కొత్త బిల్లు మహిళా రిజర్వేషన్ బిల్లు పట్ల సర్వత్రా ప్రశంశల వర్షం కురుస్తోంది. కానీ ఈ బిల్లును ఈ దఫా జరగనున్న ఎన్నికలలో కాకుండా 2027వ సంవత్సరం నుండి అమలు లోకి రానున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కాగా తాజాగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన స్వాతంత్య ఎంపీ సుమలత ఈ రోజు పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. అంతే కాకుండా సుమలత ఒక కొత్త ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకువచ్చింది. ఈ సంవతసరం జరగనున్న ఎన్నికలలోనే ఈ బిల్లును అమలులోకి తీసుకురావాల్సిందిగా మోదీని కోరారు. అయితే మహిళా ఎంపీ తీసుకువచ్చిన ఈ ప్రతిపాదన అమలు చేయడం సాధ్యం కాదన్న విషయం తెలిసిందే.

కానీ కొన్ని పార్టీల నుండి ఈ బిల్లుపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తోంది.. ముస్లిం లకు మరియు ఓబీసీ కేటగిరీ కి చెందిన వారికీ తగిన గుర్తింపు దక్కలేదని ఎంఐఎం మరియు సమాజ్వాదీ పార్టీలు గుర్రుగా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version