ప్రధాని మోడీకి ముద్రగడ పద్మనాభం లేఖ

-

దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడికి కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ నేపథ్యంలోనే.. ప్రధాని నరేంద్ర మోడీకి ఈ లేఖ రాశారు ముద్రగడ పద్మనాభం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ యోచన విరమించుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీకి రాసిన లేఖ లో కోరారు ముద్రగడ పద్మనాభం.

Mudragada Padmanabham
Mudragada Padmanabham

ఎంతో మంది ప్రాణ త్యాగాల ఫలితంగా సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయడం తగదని లేఖలో వెల్లడించారు ముద్ర గడ. రైతుల సహకారం కోసం మూడు వ్యవసాయ బిల్లులు రద్దు చేసిన మాదిరిగానే భవిష్యత్తు లో ఈ ప్రాంత ప్రజల అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రైవేటీకరణ విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. తమ విజ్ఙప్తి పై ప్రధాని నరేంద్ర మోడీ.. సానుకూలంగా స్పందించి… నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వం… దీనిపై వెనక్కి తగ్గకపోతే… ముందు ముందుకు వారికే అనేక సమస్యలు వస్తాయని ఆయన తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news