స్థానిక సంస్థల బలోపేతానికి జనసేన కట్టుబడి ఉంది : నాదెండ్ల మనోహర్‌

-

గ్రామ స్వరాజ్యం కోసం ఎంతోమంది పెద్దలు కృషి చేశారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘వైసీపీ ప్రభుత్వంలో నిధులు మళ్లించి అభివృద్ధి లేకుండా చేశారు. పంచాయతీ ఎన్నికల్లో ఎన్నో ఎదుర్కొని మీరంతా నిలబడి గెలిచారు.స్థానిక సంస్థలను బలోపేతం చేయాలనేదే పవన్ కళ్యాణ్ సంకల్పం అని అన్నారు. అన్యాయాలు, అక్రమాలను ఎదిరించే శక్తి జనసేనకు ఉంది అని వెల్లడించారు.

స్థానిక సంస్థలకు కేంద్రం నిధులిస్తున్నా.. వాటిని రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోంది.. గ్రామ స్థాయిలో రాజకీయాలు ఉండకూడదనే ఉద్దేశ్యంతోనే పార్టీ సింబల్‌ లేకుండా ఎన్నికలు జరుపుతారు.. గ్రామ పంచాయతీలకు రావాల్సిన నిధులు.. పన్నులు దారి మళ్లిస్తున్నారు అంటూ ఆయన ఆరోపించారు. స్థానిక సంస్థల బలోపేతానికి పోరాడేందుకు జనసేన సిద్దంగా ఉంది అని నాదేండ్ల మనోహార్ పేర్కొన్నారు.
రాజకీయాలకతీతంగా స్థానిక సంస్థల బలోపేతం కోసం అందరూ పని చేయాల్సిన అవసరం ఉంది అని ఆయన తెలిపారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version