Nagarjuna: ‘లంబసింగి’ అందరికీ నచ్చేస్తుందన్న నాగార్జున..తొలి పాట విడుదల

-

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ కురసాల సమర్పణలో తెరకెక్కిన పిక్చర్ ‘లంబసింగి’. ఏ ప్యూర్ లవ్ స్టోరి అనే క్యాప్షన్ తో వస్తున్న ఈ సినిమాకు నవీన్ గాంధీ డైరెక్టర్. భరత్ హీరో కాగా, ‘బిగ్ బాస్’ ఫేమ్ దివి హీరోయిన్. జీకే మోహన్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమాలోని తొలి పాట ’నచ్చేసిందే నచ్చేసిందే..’ని టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తాజాగా రిలీజ్‌ చేశారు.

సినిమా చక్కటి విజయం సాధించాలని నాగార్జున అన్నారు. తన దర్శకుడు కల్యాణ్‌ కృష్ణ కురసాల కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్‌ చేస్తూ నిర్మించిన మూవీ ‘లంబసింగి’ అని వివరించారు. ఇక ఈ పాట తనకూ నచ్చేసిందని, చిత్రం ‘నచ్చేస్తుందని’, అందరూ పాట వినాలని కోరారు. విశాఖ సమీపంలోని లంబసింగి నేపథ్యంలో లవ్ స్టోరితో సినిమా తీసినట్లు డైరెక్టర్ నవీన్ తెలిపారు.

హీరో హీరోయిన్స్ మధ్య సీన్స్, లవ్ స్టోరి ఆసక్తికరంగా, ఆకట్టుకునే విధంగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సాంగ్ ను సిద్‌ శ్రీరామ్‌ ఆలపించగా, ఫేమస్ లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్‌ లిరిక్స్ రాశారు. ఆర్‌ఆర్‌ ధృవన్‌ సంగీతం అందించారు. ఈ చిత్ర విడుదల తేదీని త్వరలో మేకర్స్ అనౌన్స్ చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news