నిక్కీ గల్రానీతో ఆది పినిశెట్టి పెళ్లి.. ముందే చెప్పిన నాని..

-

టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి తనయుడు ఆది పినిశెట్టి హీరోగా తొలుత కోలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత తెలుగు భాషలోనూ పలు చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘సరైనోడు’ పిక్చర్ లో విలన్ రోల్ ప్లే చేసిన ఆది.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘రంగ స్థలం’ ఫిల్మ్ లో కీ రోల్ ప్లే చేశాడు. ఈ సంగతులు అలా ఉంచితే ఇటీవల ఆది పినిశెట్టి తన అభిమానులకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పాడు. అదేంటంటే తన వైవాహిక జీవితం అనగా మ్యారేజ్ గురించి.. తాను హీరోయిన్ నిక్కీ గల్రానీని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపాడు.

ఈ క్రమంలోనే ఈ నెల 24న ఎంగేజ్ మెంట్ జరగగా, ఇందుకు సంబంధించిన ఫొటోలను నెట్టింట షేర్ చేయగా, అవి వైరలయ్యాయి. అయితే, వీరి పెళ్లి గురించి నేచురల్ స్టార్ నాని గతంలోనే చెప్పాడు. వీరిరువురు మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేయగా, అప్పుడు ఆది పినిశెట్టి అలా సరదాగా నవ్వేశాడు. కానీ, తర్వాత ఆ మాటలను నిజం చేశాడు.

నిక్కీ గల్రానీ, ఆది పినిశెట్టి కలిసి జంటగా ‘యాగవరైనమ్ నా కక్కా’ అనే తమిళ్ చిత్రంలో నటించారు. ఈ పిక్చర్ తెలుగులో ‘మలుపు’ పేరుతో విడుదలైంది. ఈ చిత్ర షూటింగ్ సమయంలోనే వీరిరువురు ప్రేమలో పడ్డట్లు తెలుస్తోంది. వీరిరువురు ‘మరకతమణి’ అనే బొమ్మలోనూ నటించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా నాని మాట్లాడుతూ..ఆది పినిశెట్టిని నిక్కీని పెళ్లి చేసుకోవచ్చుగా బాగానే ఉందని అంటూ కామెంట్ చేశాడు.

అప్పుడు సైలెంట్ గానే నవ్వేశాడు ఆది.. అలా స్టేజీపైన ఉన్న వాళ్లందరూ నవ్వుకున్నారు. కానీ, తర్వాత కాలంలో వీరి మధ్య ప్రేమ చిగురించి అది పెళ్లి వరకు వచ్చింది. నాని, ఆది పినిశెట్టి ‘నిన్ను కోరి’ చిత్రంలో కలిసి నటించారు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద సక్సెస్ అయింది. ఇందులో ఆది పినిశెట్టి పోషించిన పాత్రకు చక్కటి పేరు కూడా వచ్చింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news