పాదయాత్ర ప్రకటించగానే వైసిపి నేతల ప్యాంట్లు తడిచిపోయాయ్ – నారా లోకేష్

-

యువగళం పేరుతో పాదయాత్ర ప్రకటించగానే వైసిపి నేతల ప్యాంట్లు తడిచిపోయాయని ఎద్దేవా చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. కుప్పంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. టిడిపి అధినేత చంద్రబాబు దేవుడి లాంటివాడు అని, తాను మాత్రం వైసిపి వాళ్ళ పాలిట రాక్షసుడుని అవుతారని హెచ్చరించారు.

చంద్రబాబు కుప్పంలో మెడికల్ కాలేజీ తీసుకువచ్చారని, ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకువచ్చారని, డిగ్రీ కళాశాల, ద్రవిడ వర్సిటీ, పాఠశాలలు తీసుకువచ్చారని తెలిపారు. కుప్పంలో ఏ రోడ్డు చూసినా దానిపై చంద్రబాబు పేరు ఉంటుందన్నారు నారా లోకేష్. జగన్ రెడ్డి అమూల్ పాలు తాగే సమయంలో చంద్రబాబు ఇజ్రాయిల్ టెక్నాలజీ తో కుప్పంలో డ్రిప్ ఇరిగేషన్ తీసుకువచ్చారని తెలిపారు.

పేదలకు 100 కోట్లతో హౌసింగ్ ప్రాజెక్టులు ప్రారంభిస్తే ఈ సైకో ఆపివేశాడని, రింగ్ రోడ్డు పనులు ప్రారంభిస్తే ఈ సైకో ముఖ్యమంత్రి అయ్యాక ఆపివేశాడని ఆరోపించారు. తనని ఏ అర్హతతో పాదయాత్ర చేస్తున్నావని వైసీపీ మంత్రులు ప్రశ్నిస్తున్నారని.. ” రెండున్నర ఏళ్లు మంత్రిగా పనిచేసే 25 వేల కిలోమీటర్ల సిసి రోడ్లు వేయించా, 25 లక్షల వీధి దీపాలు పెట్టించా, యువకులకు 40 వేల ఉద్యోగాలు ఇప్పించా, ఈ అర్హతతోనే పాదయాత్ర చేస్తున్న” అని తెలిపారు నారా లోకేష్.

Read more RELATED
Recommended to you

Latest news