ఏపీ పోలీసులందరూ..వైసీపీ రౌడీ షీటర్లే : నారా లోకేష్‌

-

ఏపీ పోలీసులందరూ..వైసీపీ రౌడీ షీటర్లే నని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఉన్నది పోలీసులా? వైసీపీ రౌడీషీటర్లకి అనుచరులా? అనే అనుమానాలున్నాయని.. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడమే నేరంగా శ్రీకాకుళం జిల్లా మందస మండలం పొత్తంగి గ్రామ టీడీపీ కార్యకర్త కోన వెంకటరావుని వేధించి బలవన్మరణానికి కారణమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైసీపీ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని… ప్రభుత్వ వైఫల్యాలు, వైసీపీ అవినీతి, అక్రమాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని ఇలా చంపుకుంటూ పోతే రాష్ట్రంలో వైసీపీ నేతలు-పోలీసులు మాత్రమే మిగులుతారని నిప్పులు చెరిగారు.

మా టిడిపి కార్యకర్త కోన వెంకటరావు మృతికి కారణమైన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, బాధ్యులైన పోలీసులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్‌ చేశారు. వెంకటరావు కుటుంబానికి తెలుగు దేశం పార్టీ అన్ని విధాలా అండగా వుంటుందని.. సోషల్ మీడియా పోస్టుల పేరుతో టిడిపి కార్యకర్తలపై ఇకనైనా వేధింపులు ఆపాలని హెచ్చరించారు. చట్టాలని గౌరవిస్తున్నామని.. పోలీసుల్ని అడ్డుపెట్టుకుని అరాచకాలకి తెగబడితే తిరుగుబాటు తప్పదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news