నాకు సీఎం కావాలని ఉంది.. అజిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు

-

తనకు సీఎం పదవి కావాలని ఉందంటూ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగబోతున్న నేపథ్యంలో సీఎం పదవీ పై ఆయన స్పందించడం పై పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా దగ్దుషేత్ హల్ద్వాయ్ గణపతి ఆలయంలో పూజలు చేసిన తరువాత మాట్లాడిన అజిత్ పవార్.. అందరూ తమ నాయకుడు సీఎం కావాలని కోరుకుంటారు.

సీఎం పీఠం అధిరోహించాలనే అందరి ఆకాంక్ష నెరవేరదు. ఇది జరగాలంటే ఓటర్ల చేతిలో ఉంటుంది. 288 స్థానాలకు 145 సీట్లు దక్కించుకోవడం చాలా అవసరమన్నారు. సీఎం ఏక్ నాథ్ షిండే నేతృత్వంలో బీజేపీ, శివసేన, ఎన్సీపీలతో కూడిన మహాకూటమి నేతృత్వంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తామన్నారు. మళ్లీ మహాకూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి సమిష్టి ప్రయత్నం చేస్తామన్నారు. మహాకూటమి అధికారంలోకి వచ్చాక సీఎం పదవి పై అందరం కలిసి నిర్ణయం తీసుకుంటామన్నారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత శివసేన నేతలు సీఎం కావాలని శివసేన నేతలు డిమాండ్ చేస్తున్న తరుణంలో తాజాగా పవార్ చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకోవడం గమనార్హం. 

Read more RELATED
Recommended to you

Exit mobile version