ఇండియాలో కొత్తగా 3805 కరోనా కేసులు, 22 మరణాలు నమోదు

-

మన దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ క్రమ క్రమంగా తగ్గుతోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్త కరోనా పాజిటివ్ కేసులు 3805 నమోదయ్యాయి.

దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,30,98,743 కు చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3168 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.04 శాతంగా ఉంది.

ఇక దేశంలో తాజాగా 22 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,24,024 కి చేరింది.ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 20,303 కు చేరింది. ఇక దేశ వ్యాప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,25,54,416 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,90,00,94,982 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 3,22,100 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.

Read more RELATED
Recommended to you

Latest news