Jammu Kashmir: జవాన్లు ప్రయాణిస్తున్న వాహనంలో పేలుడు..

-

జమ్మూ కాశ్మీర్ లో వరసగా ఎన్ కౌంటర్లు జరగుతున్నాయి. భద్రతా బలగాలు టెర్రరిస్టులను హతమార్చతున్నారు. ఇదిలా ఉంటే ఉగ్రవాదులు అమాయకపౌరులను టార్గెట్ చేస్తున్నారు. ఇటీవల వరసగా మూడు సంఘటనల్లో టీవీ నటి అమ్రీన్ భట్, హిందూ మహిళా టీచర్ ను కాల్చి చంపారు టెర్రరిస్టులు. మరో ఘటనలో ఓ పౌరుడిపై కాల్పులు జరిపి గాయపరిచారు. 

ఇదిలా ఉంటే జమ్మూ కాశ్మీర్ లో మరో ఘటన జరిగింది. షోఫియాన్ లో  ముగ్గురు జవాన్ల ప్రయాణిస్తున్న వాహనంలో పేలుడు చోటు చేసుకుంది. ప్రైవేటు వాహనాన్ని అద్దెకు తీసుకుని వెళ్తున్న సమయంలో వాహనంలో పేలుడు సంభవించింది. ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు కాశ్మీర్ జోన్ ఐజీ విజయ్ కుమార్ వెల్లడించారు. ఇది గ్రనేడ్ దాడా..? లేకపోతే ముందే పథకం ప్రకారం ఐఈడీ అమర్చి పేల్చారా..? బ్యాటరీ పేలిందా..? అనేది దర్యాప్తు జరుగుతుందని వెల్లడించారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news