మోడీ సర్కార్ వారి పాట : ఒక్కో బహుమతి వేలం రేటు 2.7 కోట్లు

-

ప్రధాని మోడీ.. తనకు వచ్చిన బహుమతులను వేలం వేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. దీనిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాక్యలు చేశారు. ప్రధాని మోడీ ఒక కొత్త మార్గదర్శనం చేస్తున్నారన్నారు. ప్రధానిగా ఎన్నో ప్రదేశాలు పర్యటిస్తారు, ఎందరో ప్రధానిని కలుస్తుంటారని.. ఈ సమయంలో ప్రధాని గౌరవంగా బహుమతులు ఇస్తుంటారని తెలిపారు.

2019 నుంచి ప్రతియేటా బహుమతుల వేలం జరుగుతోందని.. ఈ సారి 1222 బహుమతులకు వేలం జరుగుతోందని వివరించారు. ప్రతి బహుమతి 2.7 కోట్ల సర్కార్ వారి పాట ( కనీస ధర) గా ఉందని తెలిపారు. 25 బహుమతులు క్రీడా కారులు ఇచ్చినవి ఉన్నాయని… అయోధ్య రామమందిరం గిఫ్ట్ ఉందని వెల్లడించారు. వారణాసి కాశీ విశ్వ నాథ ఆలయం నమూనా గిఫ్ట్ ఉందని స్పష్టం చేశారు. నేతాజీ సుభాష్ చంద్ర బోస్ విగ్రహం కూడా వేలం లో ఉందన్నారు. వేలం ద్వారా వచ్చిన నిధులను నవామి గంగ కోసం కేటాయిస్తామని ప్రకటించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news