కవల పిల్లలకు తల్లిదండ్రులైన నయన్-విఘ్నేశ్… షాక్​లో ఫ్యాన్స్​

-

నయనతార, విఘ్నేశ్‌ శివన్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌ చెప్పారు. తాము తల్లిదండ్రులైనట్టు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని విఘ్నేశ్ సోషల్​ మీడియాలో ప్రకటించారు. తమ ప్రార్థనలు, పూర్వీకుల ఆశీర్వాదాలు ఫలించాయని పేర్కొన్నారు. తమ పిల్లలను ఆశీర్వదించాలని కోరారు. ఈ మేరకు కొన్ని ఫొటోలను షేర్ చేశాడు. అభిమానులు, నెటిజన్లు, పలువురు సినీ ప్రముఖులు నయన్‌, విఘ్నేశ్‌లకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

అయితే 4 నెలల కిందటే నయనతార, విఘ్నేశ్‌ శివన్‌ మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వం వహించిన ‘నేను రౌడీనే’ చిత్రంతో పరిచయమైన వీరిద్దరూ సుమారు ఏడేళ్ల నుంచి ప్రేమలో ఉన్నారు. ఈ క్రమంలో కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం మహాబలిపురంలోని ఓ ప్రముఖ హోటల్‌లో ఘనంగా జరిగింది. అయితే అప్పుడే పిల్లలు పుట్టినట్లు ప్రకటించడంపై ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. పెళ్లికి ముందే సరోగసీ ద్వారా ప్లాన్ చేశారేమో అని కామెంట్స్ చేస్తున్నారు.

 

నయన్‌కు సోషల్ మీడియాలో ఎలాంటి అకౌంట్స్ లేవు. అవన్నీ విఘ్నేషే చూసుకుంటున్నాడు. నయన్ అప్‌డేట్స్, సినిమా ప్రమోషన్లనీ విఘ్నేషే చూసుకుంటున్నాడు. పైగా, ఆమె గతాన్ని చూడకుండా ఆమె మనసును మాత్రమే అర్థం చేసుకుని మెలగడం విఘ్నేష్‌కే చెల్లుతుంది. అలా విఘ్నేశ్ తన సోషల్ మీడియా వేదికగా ఈ శుభవార్తను పోస్ట్ చేశారు. పెళ్లై నాలుగు నెలలు అయినా.. తల్లిదండ్రులు అవ్వడం ఆశ్చర్యాన్నే కలిగిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version