రాజ్యసభ రేసులో కొత్త పేర్లు..జగన్ చూపు ఎవరి వైపు!

-

రాజ్యసభ పదవుల విషయంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయమే తీసుకునేలా ఉన్నారు…ఇప్పటివరకు రాజ్యసభ రేసులో వేరే పేర్లు వచ్చాయి…కానీ ఇప్పుడు కొత్త పేర్లు తెరపైకి వచ్చాయి. దీంతో రాజ్యసభ పదవి ఎవరికి దక్కుతుందనే క్లారిటీ ఎవరికి రావడం లేదు. ప్రస్తుతం ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నలుగురు రాజ్యసభ ఎంపీల పదవీకాలం ముగియనున్న విషయం తెలిసిందే.

వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి, బీజేపీ నుంచి సురేష్ ప్రభు, సుజనా చౌదరీ, టీజీ వెంకటేష్‌ పదవీకాలం ముగుస్తుంది. ఇక ఈ నాలుగు పదవులు వైసీపీకే దక్కనున్నాయి. దీంతో వైసీపీలో పదవులు ఆశించే వారి లిస్ట్ పెరిగింది. ఈ నాలుగింటిలో ఒకటి ఖచ్చితంగా విజయసాయిరెడ్డికి ఇవ్వడం ఖాయం..ఆయనకు పదవి రెన్యూవల్ చేయనున్నారు. ఇంకా మూడు పదవుల కోసం పోటీ పెరిగింది. ఇదే సమయంలో ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీ సతీమణి ప్రీతి అదానీకి రాజ్యసభ పదవి అడుగుతున్నట్లు తెలుస్తోంది.

ఇక వారికి రాజ్యసభ ఇవ్వడానికి జగన్ కూడా సిద్ధంగానే ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. గతంలో అలాగే అంబానీ రికమండేషన్ చేయడంతో పరిమళ్ నత్వానీకి రాజ్యసభ పదవి ఇచ్చారు…అలాగే రాంకీ అధినేత అయోధ్య రామిరెడ్డికి సైతం పదవి ఇచ్చారు. మరి ఇప్పుడు అదానీ సతీమణికి కూడా పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. సినీ నటుడు ఆలీకి పదవి ఇస్తానని జగన్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే..మరి ఆయనకు పదవి ఇస్తారో లేదో చూడాలి.

ఇదిలా ఉంటే రాజ్యసభ రేసులో కొత్తగా సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ పేర్లు వచ్చాయి..సజ్జల సలహాదారుడుగా ఉండగా, బొత్స మంత్రిగా ఉన్నారు. అంటే నెక్స్ట్ ఎలాగో మంత్రివర్గంలో మార్పులు జరిగితే తనని సైడ్ చేస్తే..ఎమ్మెల్యేగా ఉండటం కంటే రాజ్యసభ తీసుకుంటే కాస్త గౌరవంగా ఉంటుందని బొత్స అనుకుంటున్నారేమో తెలియాల్సి ఉంది. మరి చూడాలి చివరికి జగన్ ఎవరికి రాజ్యసభ పదవి ఇస్తారో.

Read more RELATED
Recommended to you

Latest news