ఆర్థిక అవసరాల కోసం బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థలు ఎన్నో రకాల రుణాలను అందిస్తూ ఉంటాయి. అయితే వాటిలో బంగారం, వెండి రుణాలు కూడా ఎక్కువగానే ఉంటాయని చెప్పవచ్చు. దీనికి సంబంధించి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంగారం మరియు వెండి రుణాలకు కొన్ని రకాల నియమాలను అమలు చేయడానికి ప్రయత్నిస్తోంది. ఈ కొత్త నియమాలు అన్ని రకాల వాణిజ్య బ్యాంకులు, ఎంబీఎఫ్సీలు, సహకార బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు వంటి వాటికి వర్తిస్తాయి. బంగార రుణాలకు సంబంధించి, బంగారం విలువలో 80 శాతం వరకు రుణాన్ని పొందవచ్చు. అయితే, ముందు దీనికి సంబంధించి 75 శాతం రుణాన్ని మాత్రమే ఇచ్చేవారు.
కొత్త నియమాలలో లోన్ వ్యాల్యూ పరిమితి వడ్డీతో పాటుగా 2.5 లక్షల వరకు వర్తిస్తుంది అని చెబుతున్నారు. ఒకవేళ 2.5 లక్షల కంటే తక్కువ బంగారు రుణాలు ఇస్తున్నట్లయితే ఎటువంటి తనిఖీలు చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఆదాయ ధ్రువీకరణ లేఖ, క్రెడిట్ రికార్డులను నిర్వహించాల్సిన పని లేదు. అంతేకాకుండా, ఎప్పుడైతే రుణంలో బంగారు ఆభరణాలను తాకట్టు పెడతారో, అవి ఒక కిలోకు మించి ఉండకూడదు. అదే బంగారు నాణాలు అయితే 50 గ్రాములు వరకు ఉండాలి. వెండి ఆభరణాలు 10 కిలోలకు మించకూడదు, అలాగే వెండి నాణాలు 500 గ్రాముల వరకు మాత్రమే ఉండాలి.
ఈ విధంగా బంగారం మరియు వెండి కు సంబంధించిన రుణాలకు ఇటువంటి కొత్త నియమాలను తీసుకురావడం జరిగింది. ఈ రుణాలను పొందిన తర్వాత, సరైన సమయంలో తిరిగి చెల్లించకపోతే బంగారం వేలం వేసే ముందు నోటీసును తప్పకుండా ఇవ్వాలి. అంతేకాకుండా వాటి ధర మార్కెట్ విలువలో కనీసం 90 శాతం ఉండాలి. ఎప్పుడైతే వేలంలో లోన్ కంటే ఎక్కువ మొత్తం వస్తుందో ఆ ధనాన్ని రుణగ్రహితకు ఇవ్వాలి. ఇదంతా కేవలం ఒక వారం లోపు జరగాలి. ఇలా కొత్త నియమాల ద్వారా బంగారం, వెండి రుణాలకు మరింత ప్రయోజనం అనే చెప్పవచ్చు.