క్రేజీ బజ్..కమల్ హాసన్ ‘విక్రమ్’ సీక్వెల్‌లో రామ్ చరణ్!

-

లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ సినిమా దూసుకుపోతున్నది. ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి అఖండ ఆదరణ లభిస్తోంది. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో సూర్య, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషించారు. కాగా, ఈ చిత్రానికి సీక్వెల్ ఉండబోతున్నదని వార్తలొస్తున్నాయి.

‘విక్రమ్’ సీక్వెల్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లీడ్ రోల్ ప్లే చేస్తారని అంటున్నారు. ఇందుకు సంబంధించిన అఫీషియల్ అప్ డేట్ త్వరలో వస్తుందని తెలుస్తోంది. లోకేశ్ కనకరాజ్-రామ్ చరణ్ కాంబోలో సినిమా ఉంటుందని వార్తలు రాగా, అది ఇదేనని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

‘విక్రమ్’ సీక్వెల్ లో స్టోరి ఊహించని మలుపులు తిరుగుతుందని సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతోంది. అయితే, ఈ విషయమై అఫీషియల్ అనౌన్స్ మెంట్ అయితే రాలేదు. రామ్ చరణ్ ప్రస్తుతం ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో RC15 ఫిల్మ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తుండగా, కార్తీక్ సుబ్బరాజ్ స్టోరి అందించారు.

Read more RELATED
Recommended to you

Latest news