ఆ సినిమాతో SSMB28కి పోలిక..మహేశ్-త్రివిక్రమ్ ప్లాన్ ఏంటో మరి?

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రజెంట్ ‘సర్కారు వారి పాట’ ఫిల్మ్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. త్వరలో తన స్నేహితుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో SSMB28 సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు. కాగా, ఈ చిత్రం ప్రకటన వచ్చిన నాటి నుంచి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘అతడు’, ‘ఖలేజా’ వంటి బ్లాక్ బాస్టర్ ఫిల్మ్స్ తర్వాత వీరిరువురి కాంబోలో వస్తున్న ఈ చిత్రం డెఫినెట్ గా రికార్డులను తిరగరాస్తుందని అంటున్నారు.

ఇక ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పై ఇప్పటికే బోలెడన్ని వార్తలు సోషల్ మీడియాలో వచ్చాయి. ‘పార్థు’, ‘అర్జునుడు’ అనే టైటిల్స్ సినిమా కోసం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం..ఈ సినిమా స్టోరిపైన కూడా డిస్కషన్ జరుగుతోంది.

ఈ చిత్రం విక్టరీ వెంకటేశ్ సూపర్ హిట్ ఫిల్మ్ ‘నువ్వు నాకు నచ్చావ్’ స్టోరిలాగా ఉంటోందని టాక్. మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా హీరోగా కనిపిస్తాడు. SSMB28లోనూ అటువంటి స్టోరియే ఉన్నప్పటికీ టేకింగ్ డిఫరెంట్ గా ఉంటుందని వినికిడి. ఈ మేరకు ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో సెకండ్ హీరోయిన్ గా ప్రియాంక అరుళ్ మోహన్ ఫైనల్ అయినట్లు కూడా వార్తలు వచ్చాయి.

ఈ పిక్చర్ రెగ్యులర్ షూటింగ్ జూన్ సెకండ్ వీక్ నుంచి స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. ఇందులో కథానాయికగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆస్థాన హీరోయిన్ టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తోంది. ఈ మూవీని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ(చినబాబు) ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news