ఎవడ్రా మరదలు…నీకు సిగ్గుండాలి కదా – నిరంజన్ రెడ్డిపై షర్మిల సీరియస్

-

తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ షర్మిల. గతంలో నిరంజన్‌ రెడ్డి చేసిన మరదలు వ్యాఖ్యలకు తాజాగా షర్మిల కౌంటర్‌ ఇచ్చారు. నిరుద్యోగుల పక్షాన నేను దీక్షలు చేస్తుంటే…నన్ను మంగళవారం మరదలు ఆని సంబోదించాడని మండిపడ్డారు. ఎవడ్రా మరదలు…నీకు సిగ్గుండాలి కదా అంటూ ఓ రేంజ్‌ లో రెచ్చి పోయారు.

మీకు ఉద్యోగాలు ఇవ్వచేత కాక నిరుద్యోగుల కోసం మేము దీక్షలు చేస్తున్నామని.. నా పోరాటం లో నీకు మరదలు కనిపించిందా అని నిలదీశారు. అధికార మధం తలకు ఎక్కిందా అని ప్రశ్నించారు. పరాయి స్త్రీ లో తల్లి నీ ..చెల్లేను చూడాలని సంస్కార హీనుడని… ఈయనకు.. వీది చివరన ఉన్న కుక్క కు ఏమైనా తేడా ఉందా అని ప్రశ్నించారు షర్మిల.

వరి వేసుకుంటే ఉరి అని సన్నాసి ముఖ్యమంత్రి అంటే.. వరి వేసుకోవద్దు అని ఈ పెద్ద సన్నాసి ఆదేశాలు ఇచ్చాడని… ఈ సన్నాసులకు పరిపాలన చేతన అవుతుందా ఓ రేంజ్‌ లో రెచ్చిపోయారు షర్మిల. ఎమ్మెల్యే కాక ముందు ఈయన దగ్గర డబ్బులే లేవు..అప్పుల పాలు అయిన నిరంజన్ రెడ్డి ఇవ్వాళ వేల కోట్లు ఎలా సంపాదించారు? మంత్రి అయ్యాక పెద్ద దొర అయ్యాడట అంటూ చురకలు అంటించారు.

Read more RELATED
Recommended to you

Latest news