హైదారాబాద్‌లో మరో పరువు హత్య.. యువకుడిపై కక్షగటి కడతేర్చిన యువతి కుటుంబీకులు

-

ఇటీవల హైదరాబాద్‌లోని సరూర్‌ నగర్‌లో చోటు చేసుకున్న పరువు హత్య ఘటనను మరిచిపోక ముందే మరో పరువు హత్య నగరంలో చోటు చేసుకుంది. ఓ యువకుడు తమ ఇంటి ఆడపిల్లను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని కోపంతో యువతి కుటుంబీకులు నడిరోడ్డుపై విచక్షణా రహితంగా కత్తులతో దాడి చేసి హతమార్చారు. వివరాల్లోకి వెళితే.. బేగంబజార్‌ మచ్చి మార్కెట్‌ వద్ద నీరజ్‌ పన్వార్‌ అనే యువకుడిని నలుగురు దుండగులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు.

TASMAC employee stabbed, another injured in knife attack - India News

ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కక్షతో దుండగులు దాడి చేసినట్లు తెలుస్తోంది. ఏడాది క్రితం నీరజ్‌ పన్వార్‌ ప్రేమ వివాహం చేసుకున్నాడు. దీంతో కక్షగట్టిన యువతి కుటుంబీకులు ఈ రోజు సాయంత్రం నీరజ్‌ పన్వార్‌ను అడ్డగించి కత్తులతో దాడి చేసి కడతేర్చారు. అయితే.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని.. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news