పటాన్ చెరులో కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు

-

అక్రమ నిర్మాణాలపై హైడ్రా మరోసారి కొరడా ఝలిపిస్తోంది. చెరువు భూములు, ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు చేపట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు తీసుకొచ్చిన హైడ్రా ఇప్పటికే కొన్ని వందల ఎకరాల ప్రభుత్వ భూములను రక్షించింది.

చాలా వరకు చెరువు భూములను సైతం కాపాడింది. ఇప్పటికే నిర్మించిన చాలా వరకు ఆక్రమణకు కూల్చివేసింది. శుక్రవారం ఉదయం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ముత్తంగి గ్రామంలో 296 సర్వే నంబర్లలో ఉన్న గాయత్రి వెంచర్ పార్క్ స్థలంలో నిర్మించిన షెడ్డును హైడ్రా అధికారులు కూల్చివేశారు. ముందుస్తు సమాచారం మేరకు రంగంలోకి దిగిన అధికారులు పూర్తి ఆధారాలతో కూల్చివేతలు కొనసాగిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version