నిజం నిప్పులాంటిదని, ఎవరూ కప్పిపుచ్చలేరు : పట్టాభిరామ్

-

ఏపీలో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ న్యూడ్‌ వీడియో అంటూ వైరల్‌ అయిన వీడియో సంచలనం సృష్టిస్తోంది. అయితే.. ఇప్పటికే దీనిపై అనంతపురం ఎస్పీ ఫకీరప్ప క్లారిటీ ఇవ్వగా.. టీడీపీ శ్రేణులు అది ఒరిజినల్‌ వీడియో అంటూ సర్టిఫికేట్‌ను తెరపైకి తీసుకువచ్చారు. అయితే ఈ నేపథ్యంలో.. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోపై ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం తెలిసిందే.  దీనిపై టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్పందించారు. ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు చెందిన స్టాఫోర్డ్ ఇచ్చిన నివేదిక తప్పు అని చెప్పడం సరికాదని అన్నారు పట్టాభిరామ్. స్టాఫోర్డ్ ఇచ్చిన రిపోర్టు నూటికి నూరు శాతం వాస్తవం అని స్పష్టం చేశారు పట్టాభిరామ్. స్టాఫోర్డ్ కు తాము పంపిన ఈమెయిల్స్, ఇతర ఆధారాలు అన్నీ ఉన్నాయని పట్టాభి వెల్లడించారు పట్టాభిరామ్. నిజం నిప్పులాంటిదని, ఎవరూ కప్పిపుచ్చలేరని ఉద్ఘాటించారు.

TDP dismisses CM claims on 'prohibition'

డర్టీ పిక్చర్ ఎంపీని వెనుకేసుకురావడం సిగ్గుచేటని అన్నారు పట్టాభిరామ్. మహిళలపై అత్యాచారాలను
పట్టించుకోని సీఐడీ ఇప్పుడు తమను బెదిరిస్తోందని పట్టాభి ఆగ్రహం వ్యక్తం చేశారు పట్టాభిరామ్. అన్ని రకాల పరిశోధనలతో కూడిన ఫోరెన్సిక్ నివేదిక తెస్తే, తమపైనే కేసులు పెడుతామని బెదిరిస్తున్నారని మండిపడ్డారు పట్టాభిరామ్. త్వరలోనే నివేదిక పూర్తి వివరాలు ప్రజల ముందు ఉంచుతామని తెలిపారు. టీడీపీ నేతలకు తప్పుడు పనులు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు పట్టాభిరామ్. నిజాలను కప్పిపుచ్చుకునే కార్యక్రమాలను ప్రభుత్వం మానుకోవాలని హితవు పలికారు పట్టాభిరామ్. మాధవ్ బూతు వీడియోను సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపాలని పట్టాభి డిమాండ్ చేశారు పట్టాభిరామ్.

 

Read more RELATED
Recommended to you

Latest news