పసి హృదయాన్ని కాపాడుకోవడం కోసమే దూరంగా వచ్చా..పట్టాభి ఎమోషనల్..!

-

టిడిపి అధికార ప్రతినిధి విమానం లో వెళుతున్నట్టు ఫోటోలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే తన తన పర్యటనపై… వస్తున్న విమర్శలపై తాజాగా పట్టాభి వీడియో మెసేజ్ ఇచ్చారు. డ్రగ్స్ సప్లైకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నానని నాకు అవరోధాలు సృష్టిస్తున్నారంటూ పట్టాభి ఆరోపించారు. నేను మాట్లాడిన మాటలకి లేని అర్దాలను ఆపాదించారని పట్టాభి ఆవేదన వ్యక్తం చేశారు. కుట్ర పూరితంగా నాపై కక్ష గట్టి మా ఇంటిపై దాడి చేశారు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

తన కుమార్తెపై దాడికి యత్నించి బయపెట్టారని…మానవత్వం లేకుండా భయానక వాతావరణం సృష్టించారని పట్టాభి ఆరోపించారు. నా కుమార్తెను కాపాడుకోవడం కోసం బయటకు వస్తే అధికార పార్టీ నేతలు కామెంట్స్ చేస్తున్నారని అన్నారు. విమర్శలు విపరీతర్థాలుతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాయపడిన పసి హృదయాన్ని కాపాడుకోవడం కోసమే దూరంగా వచ్చానని…బాధ్యత గల తండ్రిగా నా కుమార్తె భయాన్ని పోగొట్టడం నాకు ముఖ్యం అంటూ పట్టాభి ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో టీడీపీ అధికార ప్రతినిధిగా క్రియాశీలకంగా పాల్గొంటా అని పట్టాభి హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version