BREAKING : ఏపీ ప్రజలకు మంచి రోజులు వస్తున్నాయి – మోడీ మీటింగ్ అనంతరం పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన

-

BREAKING : ఏపీ ప్రజలకు మంచి రోజులు వస్తున్నాయి అని ప్రధాని మోడీ మీటింగ్ అనంతరం పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు. కాసేపటి క్రితమే దేశ ప్రధాని నరేంద్ర మోడీ మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం ముగిసింది. ఈ సమావేశం అనంతరం మీడియాతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడారు.

ప్రధాని మోడీని ఎనిమిది ఏళ్ల తర్వాత తాను కలిశానని వెల్లడించారు. పిఎమ్ఓ… ఆఫీస్ నుంచి తనను కలవాలని అధికారిక ప్రకటన వచ్చిందని అందుకే ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీని కలిశానని వివరించారు పవన్ కళ్యాణ్. ఇక ఈ సమావేశంలో ఏపీ పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోడీ అడిగి తెలుసుకున్నారని వెల్లడించారు. ఏపీ ప్రజలు చాలా ఆనందంగా ఉండాలని, రాష్ట్ర అభివృద్ధి జరగాలని… దానికోసం కృషి చేస్తానని ప్రధాని మోడీ హామీ ఇచ్చినట్లు వివరించారు పవన్ కళ్యాణ్.

Read more RELATED
Recommended to you

Latest news