BREAKING : ప్రధాని మోడీతో పవన్ కళ్యాణ్ భేటీ..3 ఏళ్ల తర్వాత నేడు సమావేశం !

-

ఇవాళ ఏపీలో ప్రధాని మోడీ పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖకు ప్రధాని మోడీ రానున్నారు. ఇక ఈ టూర్ లో ప్రధాని మోడీతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు.

ఇవాళ రాత్రి 8.30గం. లకు ఐఎన్ఎస్ చోళలో మోడీతో భేటీ కానున్నారు పవన్.. మూడేళ్ళ తర్వాత మోడీని కలవనున్నారు పవన్ కళ్యాణ్‌. అయితే, ఈ సమావేశంలో ఏపీ పరిస్థితులు, జగన్‌ సర్కార్‌ వైఫల్యాలపై ఇద్దరు చర్చించనున్నారని సమాచారం అందుతోంది.

ఇక విశాఖ పర్యటన నేపథ్యంలో ప్రధాని మోడీకి స్వాగతం పలకనున్నారు గవర్నర్‌ బిశ్వభూషన్‌, సీఎం వైఎస్‌ జగన్. అనంతరం మారుతి జంక్షన్ నుంచి రెండు కిలోమీటర్ల మేర ప్రధాని మోడీ రోడ్ షో జరుగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news