Breaking : గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరకున్న పవన్‌.. రేపు ఇప్పటంకు

-

ఏపీ రాజకీయం ఇప్పటం చుట్టూ తిరుగుతోంది. అయితే.. ఇటీవల ఇప్పటంలో పర్యటించిన పవన్‌ కల్యాణ్‌ బాధితులకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందిస్తానని ప్రకటించారు. అయితే.. గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో కూల్చివేతల కారణంగా నష్టపోయిన వారికి జనసేనాని పవన్ కల్యాణ్ రేపు ఆర్థికసాయం అందించనున్నారు. ఈ నేపథ్యంలో, పవన్ కల్యాణ్ ఈ సాయంత్రం గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.

In Pics: Janasena Chief Pawan Kalyan At Gannavaram Airport | Pawan Kalyan:  గన్నవరం ఎయిర్‌పోర్టులో జనసేనాని పవన్ కళ్యాణ్, అటునుంచి పశ్చిమ గోదావరి  జిల్లాలకు

విమానాశ్రయం వద్ద జనసేన వర్గాలు ఆయనకు స్వాగతం పలికాయి. పవన్ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయానికి పయనమయ్యారు. ఇప్పటం గ్రామంలో ఇటీవల రహదారి విస్తరణలో భాగంగా అధికారులు పలు కూల్చివేతలు చేపట్టారు. అయితే, జనసేన సభ ప్రాంగణానికి భూములు ఇచ్చిన కారణంగానే ఇప్పటం గ్రామస్తులపై ప్రభుత్వం కక్ష సాధిస్తోందని జనసేన ఆరోపిస్తోంది. అందులో భాగంగానే కూల్చివేతలకు పాల్పడ్డారని మండిపడుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news