పెగాసెస్ వ్యవహారంపై స్పీకర్ తమ్మినేనికి టీడీపీ ఎమ్మెల్యేల లేఖ

-

పెగాసెస్ వ్యవహారంపై ఏపీ పాలిటిక్స్ తిరుగుతున్నాయి. మమతా బెనర్జీ ఆరోపణలపై సభలో చర్చ జరగాలంటూ… వైసీపీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై తమ్మినేనికి టీడీపీ ఎమ్మెల్యేలు లేఖ రాశారు. పెగాసిస్ వ్యవహారంపై సభలో చర్చించడం సరికాదంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. పెగాసెస్ స్పెవేర్ ను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయలేదని మాజీ డీజీపీ సవాంగ్ స్పష్టం చేశారని.. అవాస్తవాలను సభలో చర్చించడం విడ్డూరంగా ఉందని లేఖలో పేర్కొన్నారు. సభా గౌరవం కాపాడాలంటూ లేఖలో కోరారు టీడీపీ ఎమ్మెల్యేలు. గతంలో పార్లమెంట్ లో పెగాసెస్ స్పైవేర్ పై చర్చ అవసరం లేదని విజయసాయిరెడ్డి చెప్పారంటూ లేఖలో టీడీపీ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. అంతకు ముందు ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యులను ఒక రోజు సస్పెండ్ చేశారు స్పీకర్. సభలో ప్రశ్నోత్తారాలు జరుగుతున్న సమయంలో టీడీపీ సభ్యులు పోడియం చుట్టుముట్టి నిరసన తెలిపారు. సభ సజావుగా జరగాలని స్పీకర్ తమ్మినేని కోరిప్పటికీ.. టీడీపీ వినలేదు. జంగారెడ్డి గూడెం  మరణాలపై చర్చించాలని పట్టుబట్టారు. దీంతో స్పీకర్ సభ్యులందరిని ఒక రోజు సస్పెండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news