మైగ్రేన్ తో బాధపడే వాళ్ళు ఈ ఆహారపదార్ధాలు తీసుకుంటే మంచిది..!

-

చాలా మంది మైగ్రేన్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు డైట్ లో ఈ పదార్థాలను తీసుకుంటే సమస్య నుండి బయట పడవచ్చు అని నిపుణులు చెప్తున్నారు. మరి ఆలస్యమెందుకు వీటి కోసం పూర్తిగా చూసేద్దాం.

మైగ్రేన్ తో బాధపడే వాళ్ళకి నొప్పి విపరీతంగా ఉంటుంది. మైగ్రేన్ కారణంగా నీరసం, వాంతులు, అలసట వంటి సమస్యలు కూడా ఉంటాయి. మైగ్రేన్ ఒక రోజు నుండి రెండు రోజుల వరకు కూడా ఉంటుంది. ఆరోగ్య నిపుణులు చెప్పిన దాని ప్రకారం డైట్ లో ఈ మార్పులు చేస్తే మంచిది.

సరైన ఆహారం తీసుకోవడం వల్ల తలనొప్పి మరియు మైగ్రేన్ తగ్గుతుందని.. ఒత్తిడి, టెన్షన్ కారణంగా కానీ హార్మోనల్ మార్పులు వల్ల కానీ నొప్పి వస్తుందని అంటున్నారు. అయితే ఆహారం నిజంగా ఎంతో మార్పు తీసుకు వస్తుందని తలనొప్పి తగ్గడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అని నిపుణులు చెబుతున్నారు.

మినరల్స్, విటమిన్స్ మరియు ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల మైగ్రేన్ రాకుండా చూసుకోవచ్చని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అయితే తలనొప్పి మరియు మైగ్రేన్ తో బాధపడే వాళ్ళు డైట్ లో ఈ ఆహారం తీసుకోండి.

డ్రై నట్స్:

మెగ్నీషియం సమృద్ధిగా ఉండే డ్రై నట్స్ ని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. దీని కారణంగా మైగ్రేన్ సమస్య తగ్గుతుంది. మీరు ప్రతిరోజూ బాదం, జీడిపప్పు, వాల్ నట్స్, గుమ్మడి గింజలని స్నాక్స్ కింద తీసుకోవచ్చు. దీనివల్ల ఇబ్బంది తగ్గుతుంది.

ఆకుకూరలు:

ఆకుకూరలు తీసుకోవడం వల్ల కూడా మైగ్రేన్ సమస్య తొలగిపోతుంది. ముఖ్యంగా పాలకూరలో ఫాలిక్ యాసిడ్ ఉంటుంది. అలానే ఇందులో విటమిన్ బి, మెగ్నీషియం ఉంటుంది. ఆకు కూరలు తినడం వల్ల మైగ్రేన్ సమస్య తొలగిపోతుందని నిపుణులు చెబుతున్నారు.

సాల్మన్ ఫిష్:

సాల్మన్ ఫిష్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఇది మైగ్రేన్ నొప్పిని తొలగిస్తుంది.అదే విధంగా సీ ఫుడ్, నాన్ స్టార్చి వెజిటేబుల్స్, గుడ్లు కూడా డైట్ లో తీసుకుంటే మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు. తలనొప్పి లేదా మైగ్రేన్ తో బాధపడే వాళ్ళు హైడ్రేట్ గా ఉండాలని కనీసం రోజుకు 8 నుండి 10 గ్లాసుల మంచినీళ్లు తీసుకోవాలని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news