దేవుడు చంద్రబాబుకు అసలు సిగ్గు పెట్టినట్లు లేదు : పేర్ని నాని

-

ఏపీలోని హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ వీడియో కాల్‌ వ్యవహరాన్ని సృష్టించిన టీడీపీ, ప్రచారం చేసిన సోషల్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా సంస్థలపై చర్యలకు ఏపీ ప్రభుత్వం ఉపక్రమిస్తుంది. ఈ మేరకు వైసీపీ పార్టీ తరుఫున పోలీసులకు ఫిర్యాదు చేయను న్నట్లు వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయాల కోసం ఎంత నీచానికైనా ఒడిగట్టి వ్యక్తి చంద్రబాబు అన్నారు. ఆయన రాజకీయాలు మొదలు పెట్టినప్పటి నుంచి అబద్ధాలే మాట్లాడతాడని, అశ్లీల చిత్రాలను సృష్టించడం, ప్రచారం చేయడం చంద్రబాబు దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. ఇదిగో సర్టిఫికేట్ తెచ్చాం…అమెరికా ఇచ్చింది అంటూ మాట్లాడారు. అదేమన్నా అమెరికా ఎఫ్‌బీఐ ఇచ్చిందా…?ఈ తప్పుడు కాగితాలు ఇచ్చింది ఎవరు…? నిస్సిగ్గుగా దుర్మార్గంగా తప్పుడు రిపోర్ట్స్ చూపుతారా…? అసత్యలతో ఒక పూట, ఒక రోజు ఏమార్చగలరేమో కానీ నిజం నిలకడగా తెలుస్తోంది. ఇంత దిగజారాల్సిన అవసరం ఏమైనా ఉందా…?దేవుడు చంద్రబాబుకు అసలు సిగ్గు పెట్టినట్లు లేదు. ఈ రిపోర్ట్ కమ్మవాళ్ళు ఇచ్చారా అని టీడీపీ వాళ్లు అడిగారు…ఈ పోతిన ప్రసాద్ ఎవరు?? అతనికి ఏమీ సంబంధం?? చంద్రబాబే నేరుగా ల్యాబ్ కి లేఖ రాయిచ్చుగా. పోతిన ప్రసాద్ రిపోర్ట్ మార్చి ఇవ్వగలరా అని అడిగాడు.

Andhra Pradesh: Ours is welfare govt, says minister Perni Nani

వాళ్ళు దాన్ని కాదంటే వీళ్ళే ఎడిట్ చేసి బయటకు వదిలారు. చంద్రబాబు, లోకేష్, పట్టాభి, అనితలు కుట్ర పూరితంగా తప్పుడు రిపోర్ట్ తో కుట్ర చేశారు. ఈ రిపోర్ట్ పోతిన ప్రసాద్ టాంపర్ చేశాడని ఆ సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఈ అశ్లీల వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు టీడీపీ వారి పై, ఆ ఛాన్నెళ్ల పై చర్యలు తీసుకోవాలి. పార్టీ తరపున వారిపై చర్య తీసుకోవాల్సిందిగా ఫిర్యాదు చేస్తాం. మద్యంపై కూడా వాళ్ళు తెచ్చింది తప్పుడు రిపోర్ట్ గా రుజువైంది. పవన్ కళ్యాణ్ మోడీ దగ్గర ఏమైనా వేషాలు వేశాడా?. ఆ పాచిపోయిన లడ్డు ఏ రోజన్నా మోడీ గారికి పెట్టాడా?. ఎన్నికల ముందు మోడీని తిట్టావ్…ఇప్పుడు ఆయన సంక నెక్కావ్. ఈ రాష్ట్రానికి అసలు నువ్వు ఏమీ చేశావ్. ప్రజలకు వినోదం, చానళ్లకు రేటింగ్ తప్ప ఆయన వల్ల ఎమి ఒరిగింది. ఏదైనా జగన్మోహన్ రెడ్డి మీదే…అంతకు తప్ప ఏమి చేస్తున్నాడు అంటూ మండిపడ్డారు.

 

Read more RELATED
Recommended to you

Latest news