బాలికకు మాయమాటలు చెప్పి భవనంలోకి తీసుకెళ్లాడు.. అక్కడ స్నేహితులతో కలిసి

-

కామాంధులు రోజు రోజుక రెచ్చిపోతున్నారు. అన్యంపుణ్యం తెలియని చిన్నారులపై తమ కామవాంఛ తీర్చుకుంటూ వారి జీవితాలను నాశనం చేస్తున్నారు. అలాంటి ఘటనే ఇంది. బాలికతో పరిచయం పెంచుకుని ఆపై స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్డడ్డాడో ప్రబుద్ధుడు. బాలిక గర్భం దాల్చడంతో విషయం వెలుగులోకి వచ్చింది. విజయవాడలో జరిగిన ఈ ఘటనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పోలీసులు కథనం ప్రకారం.. నగరంలోని బెంజి సర్కిల్ ప్రాంతానికి చెందిన నిందితుడు సాయి బాధిత బాలిక(14)తో పరిచయం పెంచుకున్నాడు.

Thief man wearing pants after violence sexual rape young woman at abandoned  house, robber criminal concept Stock Photo | Adobe Stock

ఈ ఏడాది మే నెలలో బాలికను తన బైక్‌పై ఎక్కించుకుని పటమట జిల్లా పరిషత్ పాఠశాల సమీపంలోని ఓ భవనంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. రెండు రోజుల తర్వాత మరోమారు బాలికను భవనంలోకి తీసుకెళ్లాడు. ఈసారి తన స్నేహితులు బబ్లు, ప్రకాశ్‌తో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బాలికను ఆమె ఇంటి వద్ద వదిలిపెట్టారు. గత కొన్ని రోజులుగా బాలిక శరీరాకృతిలో మార్పులు రావడాన్ని గమనించిన తల్లిదండ్రులు ప్రశ్నించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధిత బాలిక ప్రస్తుతం ఆరు నెలల గర్భిణి. బాలిక తల్లిదండ్రులు దిశ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news