భారత ప్రజాస్వామ్యం ప్రపంచానికి ఆదర్శం : ప్రధాని మోడీ

-

భారతదేశం 76వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటోంది. అయితే ఇప్పటికే ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. భారత ప్రజాస్వామ్యం ప్రపంచానికి ఆదర్శంగా నిలబడిందని చెప్పారు. ప్రజాస్వామ్య దేశాలకు భారత్‌ మార్గదర్శిగా నిలిచిందని స్పష్టం చేశారు. మహాత్మునికి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నామన్నారు. దేశప్రగతిని పరుగులు పెట్టించేందుకు ప్రతి పౌరుడు సిద్ధంగా ఉన్నాడని చెప్పారు. కేంద్రం, రాష్ట్రం ప్రజల ఆశలు సాకారమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ప్రతిక్షణం కలిసి పనిచేయాల్సిన సమయంలో ఆసన్నమైందన్నారు. మన ముందున్న బంగారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భారత ప్రజానీకం నవచేతనతో మందడుగు వేస్తున్నది.

వచ్చే 25 ఏండ్లు పంచ ప్రాణాలుగా భావించి అభివృద్ధి కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. స్వతంత్ర సమరయోధుల ఆకాంక్షలను సాకారం చేయాలన్నారు. సంపూర్ణ అభివృద్ధి మనముందున్న అతిపెద్ద సవాలని చెప్పారు. మనలో ఏ మూలన దాగివున్న బానిస మనస్తత్వాన్ని వదిలేయాని సూచించారు. సర్వ స్వతంత్ర ప్రజాస్వామ్యంగా మనం నిలబడాలని ప్రధాని వెల్లడించారు. రాజకీయ సుస్థిరత వల్ల ప్రయోజనాలను ప్రపంచానికి భారత్‌ చూపిందని తెలిపారు. రాజకీయ సుస్థిరత వల్ల అభివృద్ధిలో వేగం, నిర్ణయాధికారంలో దేశం శక్తిమంతమవుతుందని చెప్పారు. రాజకీయ సుస్థిరత దేశ గౌరవ మర్యాదలను పెంచుతుందని ప్రధాని మోదీ అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version