Breaking : గచ్చిబౌలి ఎయిర్‌లైవ్‌ పబ్‌పై కేసు నమోదు

-

హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఎయిర్ లైవ్ పబ్ పై కేసు నమోదయింది.హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో పబ్ ఓనర్, మేనేజర్, డీజే సింగర్ సహా ఏడుగురిని అరెస్ట్ చేశారు.అనంతరం డీజే సాంగ్స్ కు సంబంధించిన సామాగ్రిని సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల రాత్రి 10 గంటల తర్వాత పబ్ లలో మ్యూజిక్ సిస్టం ఉపయోగించవద్దని హైకోర్టు తేల్చి చెప్పిన విషయం తెలిసిందే.నిర్దేశించిన సౌండ్ నిబంధనలను ఉల్లంఘించిన నేపథ్యంలో ఎయిర్ లైవ్ పబ్ పై కేసు నమోదు చేశారు.

Air Live, Jubilee Hills, Hyderabad - nearbuy.com

ఇదిలా ఉంటే.. గత మూడు రోజుల న‌గ‌రంలోని అమ్నీషియా, ఎయిర్ లైవ్‌, జీరో 40 ప‌బ్‌లు శుక్ర‌వారం రాత్రి 10 గంట‌లు దాటినా డీజే సౌండ్ల‌తో త‌మ క‌స్ట‌మ‌ర్లను రంజింప‌జేశాయి. ఈ ఘ‌‌ట‌న‌ల‌పై సమాచారం అందుకున్న పోలీసులు 3 ప‌బ్‌ల‌పై కేసులు నమోదు చేశారు. సౌండ్ పొల్యూష‌న్‌కు సంబంధించి హైకోర్టు ఆదేశాలను బేఖాత‌రు చేసిన కార‌ణంగానే ఈ ప‌బ్‌ల‌పై కేసులు న‌మోదు చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news