బీజేపీకి ఎదురు దెబ్బ.. సత్తా చాటిన కాంగ్రెస్

-

కర్ణాటక స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార బీజేపీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అత్యధిక స్థానాల్లో విజయం సాధించి కాంగ్రెస్ సత్తా చాటగా, కాషాయ పార్టీ రెండో స్థానంతో సరిపెట్టుకున్నది. మొత్తం 20 జిల్లాల్లో 58 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.

మొత్తం 1184 వార్డులకు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ 401, బీజేపీ 433, జేడీ(ఎస్) 45 గెలుపొందినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలిపింది.

మిగిలిన 205 సీట్లలో చిన్న పార్టీలు, స్వతంత్రులు గెలుపొందారు.

2023లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార బీజేపీ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు హెచ్చరికగా చెప్పవచ్చు. ముఖ్యంగా మైనార్టీ ఓటర్లు అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో కాషాయ పార్టీకి ప్రతికూల ఫలితాలు వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Latest news