రాజ్‌భవన్​లో గణతంత్ర వేడుకలకు సీఎం కేసీఆర్ దూరం

-

రాజ్‌భవన్‌లో జరిగే గణతంత్ర వేడుకలకు, సాయంత్రం గవర్నర్‌ ఇచ్చే విందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ దూరంగా ఉంటారని సమాచారం. గవర్నర్‌తో విభేదాల నేపథ్యంలో అక్కడికి వెళ్లడానికి ఆయన విముఖంగా ఉన్నట్లు తెలిసింది. గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఇవాళ ఉదయం ఆయన ప్రగతిభవన్‌లో జాతీయ పతాకావిష్కరణ చేయనున్నారు. అంతకు ముందు ఆయన సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో అమర జవానుల స్మారక స్తూపం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులు అర్పించనున్నారు.

మరోవైపు రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రాల సమాఖ్యగా వర్ధిల్లుతున్న భారతదేశంలో సమాఖ్య స్ఫూర్తి పరిఢవిల్లుతూ, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం మూలస్తంభాలుగా పాలన సాగినప్పుడు మాత్రమే దేశం మరింతగా ప్రగతి పథంలో పయనిస్తుందని పేర్కొన్నారు. పవిత్ర రాజ్యాంగాన్ని ప్రతి పౌరుడు క్షుణ్ణంగా అవగాహన చేసుకుని, ఆశయాలను సాధించేందుకు మరింతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news