యూకే-లో కేటీఆర్..ఢిల్లీలో కేసీఆర్

-

తెలంగాణ యువ మంత్రి, ఐటీ శాఖ బాధ్య‌త‌లు చూస్తున్న కేటీఆర్ ప్ర‌స్తుతం యూకేలో ఉన్నారు. అటుపై దావోస్ లో జ‌రిగే వ‌ర‌ల్డ్ ఎక‌న‌మిక్ ఫోరం మీటింగ్ కు వెళ్ల‌నున్నారు.

మ‌రోవైపు కేసీఆర్ ఇవాళ ఢిల్లీకి వెళ్ల‌నున్నారు. దేశ రాజకీయాల్లో చ‌క్రం తిప్పేందుకు ఉన్న సానుకూల‌త‌లు ఏంటి అన్న‌వి మ‌రోమారు వెతుకుతున్నారు. ఈ అన్వేష‌ణ‌లో భాగంగా ఢిల్లీతో మొద‌ల‌యి షిర్డీ వ‌ర‌కూ ప్ర‌యాణించి అనంత‌రం భాగ్య‌న‌గ‌రికి చేరుకోనున్నారు. ఈ మేర‌కు షెడ్యూల్ కూడా ఖ‌రారైంది. ఆ వివ‌రాలివిగో..

పర్యటన వివరాలివే…

ఇవాళ మధ్యాహ్నం (శుక్రవారం 20.05.2022) సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన చేపట్టనున్నారు. ఢిల్లీలో ప్రముఖ ఆర్థికవేత్తలతో సమావేశమౌతారు. ఈ సందర్భంగా దేశ ఆర్థిక పరిస్థితులపై చర్చించనున్నా రు. ప్రముఖ జాతీయ మీడియా సంస్థల జర్నలిస్టు ప్రముఖులతో సీఎం సమావేశాలు నిర్వహిస్తారు. మే 22న మధ్యాహ్నం ముఖ్యమంత్రి  ఢిల్లీ నుంచి చంఢీఘర్  పర్యటన చేపడతారు. గతంలో ప్రకటించిన విధంగా జాతీయ రైతు ఉద్యమంలో అసువులు బాసిన సుమారు 600 రైతు కుటుంబాలను సీఎం పరామర్శిస్తారు. వారికి ఆర్థికంగా భరోసానందించేందుకు ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున చెక్కులను పంపిణీ చేస్తారు. చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్-లతో కలిసి చేప‌డ‌తారు. సంచలనం సృష్టించిన రైతు ఉద్యమంలో అసువులు బాసిన పంజాబ్, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన రైతుల కుటుంబాలకు చెక్కులను  అందజేస్తారు. మే  26  ఉదయం బెంగళూరు పర్యటన చేపట్టనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మాజీ భారత ప్రధాని దేవగౌడ , కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో సమావేశమౌతారు.

బెంగుళూరు నుంచి బ‌య‌లుదేరి మే 27న రాలేగావ్ సిద్ధి పర్యటనను చేపట్టనున్నారు. అక్కడ ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు  అన్నా హజారేతో భేటీ అవుతారు. అనంత‌రం షిరిడీ వెళతారు. అక్కడ నుంచి పర్యటనలను ముగించుకుని తిరిగి హైదరాబాద్-కు సీఎం చేరుకుంటారు. అటు తర్వాత మే 29 లేదా 30 న బెంగాల్, బీహార్ రాష్ట్రాల పర్యటనకు సీఎం సంసిద్దం కానున్నారు. గాల్వాన్ లోయలో వీరమరణం పొందిన భారత సైనిక కుటుంబాలను సీఎం పరామర్శిస్తారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విధంగా వారి కుటుంబాలను సీఎం ఆదుకోనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news