కేటీఆర్ అన్న…ఇది మరీ బుర్ర తక్కువ పని…

-

ఏంటో ఈ మధ్య తెలంగాణ మంత్రి కే‌టి‌ఆర్‌…ప్రతి విషయంలోనూ బాగా బుక్ అయిపోతున్నారు. ఇటీవల డ్రగ్స్ విషయంలో అనవసరంగా స్పందించి, రేవంత్ రెడ్డితో సవాళ్ళు చేసి ఇరుక్కుపోయినట్లు కనిపించారు. అలాగే సింగరేణి కాలనీలోని ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడ్డ నిందితుణ్ని పోలీసులు పట్టుకోకపోయినా.. 24 గంటల్లోనే అరెస్టు చేశారంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేయడం, ఆ తరువాత తప్పుడు సమాచారం వల్ల పొరపాటు జరిగిందని చెప్పడం చేసిన విషయం తెలిసిందే.

ktr
ktr

ఇలా అనవసరంగా బుక్ అవుతున్న కే‌టి‌ఆర్..మరొకసారి ట్విట్టర్‌లో బుక్ అయ్యారు. ఏపీలో వైద్య సిబ్బంది పొలాల వద్దకు వెళ్లి రైతులకు, రైతు కూలీలకు కరోనా వ్యాక్సిన్‌ వేస్తున్న ఫొటోను పోస్ట్‌ చేసి, అది తెలంగాణలో జరిగినట్లు, సీఎం కేసీఆర్‌ నాయకత్వం, తెలంగాణ ఆరోగ్య సిబ్బంది అంకితభావానికి ఇది నిదర్శనమని మన కే‌టి‌ఆర్ గారు…డప్పు కొట్టుకున్నారు. దీనిపై నెటిజన్లు కే‌టి‌ఆర్‌పై ఫుల్ సెటైర్లు వేస్తున్నారు.

పైగా కే‌టి‌ఆర్ పోస్ట్ చేసిన ఒక ఫోటోని ఇటీవలే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా పోస్ట్ చేసి, జగన్ ఇచ్చిన స్పూర్తితో ఉద్యమంలా వ్యాక్సినేషన్ అంటూ పోస్ట్ పెట్టారు. అంటే ఇద్దరిలో ఎవరి పోస్ట్ నిజమో అర్ధం కాకుండా ఉంది. అయిన కే‌టి‌ఆర్ చదువుకున్నవారు…వేరే రాష్ట్రంలో ఫోటోని ఎలా పోస్ట్ చేశారో అర్ధం కాకుండా ఉంది. ఎవరో పంపిస్తే కే‌టి‌ఆర్ గుడ్డిగా పోస్ట్ చేసినట్లు ఉన్నారని నెటిజన్లు అంటున్నారు.

ఇక్కడ మరీ బుర్ర తక్కువ పని ఏంటంటే…ఏ రాష్ట్రంలో ఫోటో అయినా పొలాల్లో వ్యాక్సినేషన్ ఎలా వేస్తారు? అని ప్రశ్నిస్తున్నారు. వ్యాక్సిన్‌కు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కళ్ళు తిరగడం, నీరసం, ఒళ్ళు నొప్పులు, జ్వరం లాంటివి. అలాంటప్పుడు పొలాల్లో పనిచేసేటప్పుడు వ్యాక్సిన్ ఎలా వేస్తారు? అని అడుగుతున్నారు. కనీసం కే‌టి‌ఆర్‌కు ఆ విషయం కూడా తెలియడం లేదా? అని ఫైర్ అవుతున్నారు. ఏదో ఫోటో పంపించారు..దాన్ని పెట్టేసి…తమ ప్రభుత్వం గురించి డప్పు కొట్టేయడం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news