పవన్ నాలుగో పెళ్లిపై చర్చ..నాలుగో అమ్మాయి ఎవరు?

-

రాజకీయాల్లో వ్యక్తిగత జీవితాలని సైతం తీసుకొచ్చి విమర్శలు చేయడం ఇప్పుడు నేతలకు అలవాటుగా మారింది. నిర్మాణాత్మకమైన విమర్శలు చేయడం పోయింది. అయితే సి‌ఎం స్థానంలో జగన్ సైతం..ప్రతిపక్ష నేతలని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం చర్చనీయాంశమైంది. జనసేన అధినేత పవన్ పెళ్లిళ్లలపై జగన్ పదే పదే కామెంట్స్ చేస్తున్నారు. రాజకీయాలకు పవన్ పెళ్లిళ్లలకు సంబంధం లేదు. పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారనే విషయం అందరికీ తెలుసు. అందులో కొత్త ఏమి లేదు.

అయితే వైసీపీ నేతలు ఆ అంశాన్ని పట్టుకునే పవన్‌ని విమర్శిస్తున్నారు. పవన్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా..ఆయన పెళ్లిళ్ల గురించి మాట్లాడుతున్నారు. తాజాగా జగన్..అమ్మఒడి నిధులకు బటన్ నోక్కే సభలో స్కూల్ పిల్లలు ఉండే సభలో పవన్ పెళ్లిళ్ల గురించి మాట్లాడారు. పవన్ మాదిరిగా నాలుగేళ్లకు ఒకసారి భార్యని మార్చలేమని, నాలుగు పెళ్లిళ్లు చేసుకోమని అన్నారు. ఇక పెళ్లిళ్ల గురించి టాపిక్ సరికాదని జనం అనుకుంటుంటే…అసలు పవన్ మూడు పెళ్లిళ్లు మాత్రమే చేసుకున్నారని, ఈ నాలుగో పెళ్లి ఎక్కడ నుంచి వచ్చిందనే చర్చ వస్తుంది.

ఈ క్రమంలోనే జగన్ పై జనసేన నేతలు ఫైర్ అవుతున్నారు. జగన్‌కి అసహనం పెరిగిపోయిందని జనసేన పార్టీ పీఏసీ సభ్యులు కోన తాతారావు అన్నారు. పవన్ కల్యాణ్ పెళ్లిళ్ల గురించి మాట్లాడటానికి సిగ్గు ఉండాలని, పవన్ నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడని జగన్ అంటున్నారని.. నాలుగో అమ్మాయి ఏమైనా ఆయన బంధువా? అని ప్రశ్నించారు.

ఇక జగన్‌కు సరిగా తెలుగు కూడా రాదని.. వారాహికి బదులు.. వరాహి అంటున్నారని, జగన్ సీఎం అయ్యాక ఏపీ గంజాయికి అడ్డాగా మారిందని విమర్శించారు. క్రైంలో దేశంలోనే 6వ స్థానానికి ఏపీని తీసుకెళ్లారని, 175 గెలుస్తానని అంటున్న జగన్.. పవన్ వారాహి చేస్తే తట్టుకోలేక పోతున్నాడని అన్నారు. జగన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని.. అందుకే నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడన్నారు. పవన్ పెళ్లిళ్ల కారణంగా ప్రజలకు ఎలాంటి నష్టం లేదన్నారు. మొత్తానికి పవన్ నాలుగు పెళ్లిళ్లు అని జగన్ మాట్లాడి విమర్శలు ఎదురుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news