మల్కాజ్‌గిరి లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి రేవంత్‌రెడ్డి ఘన విజయం

-

దేశవ్యాప్త సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాల్లో ఓ వైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ దూసుకుపోతుండ‌గా, తెలంగాణ రాష్ట్రంలో మిశ్ర‌మ ఫ‌లితాలు వ‌చ్చే అవ‌కాశం క‌నిపిస్తున్న‌ది. కొన్ని స్థానాల్లో తెరాస అధిక్యంలో ఉండ‌గా, మరికొన్ని స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీలు ఆధిక్యంలో ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే మల్కాజ్‌గిరి లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి రేవంత్‌రెడ్డి త‌న స‌మీప ప్ర‌త్య‌ర్థి రాజ‌శేఖ‌ర్ రెడ్డి (టీఆర్ఎస్‌)పై ఘన విజయం సాధించారు.

కాగా లోక్‌స‌భ ఎన్నికల ఫ‌లితాల్లో తెలంగాణ‌లో టీఆర్ఎస్ 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉండ‌గా 5 స్థానాల్లో ఇప్ప‌టికే ఆ పార్టీ అభ్య‌ర్థులు గెలుపొందారు. అలాగే కాంగ్రెస్, బీజేపీలు చెరో 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఇక ఈ రెండు పార్టీలు చెరో పార్ల‌మెంట్ స్థానంలో ఇప్ప‌టికే విజ‌యం సాధించాయి. అలాగే ఎంఐఎం పార్టీ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news