అఖిలేష్ యాదవ్‌ కాబోయే ప్రధానమంత్రి అంటూ లక్నోలో పోస్టర్లు

-

సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌ను ఇండియాకి కాబోయే ప్రధాన మంత్రి అని పేర్కొంటూ లక్నోలో పార్టీ కార్యాలయం వెలుపల కొన్ని పోస్టర్లు కనిపించాయి.జులై 1న అఖిలేష్ యాదవ్ పుట్టిన రోజు కావడంతో శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్న పోస్టర్లలో ‘దేశానికి కాబోయే ప్రధానమంత్రి, గౌరవనీయులైన శ్రీ అఖిలేష్ యాదవ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని రాసి ఉంది.2023లో కూడా అఖిలేష్ యాదవ్‌ను “కాబోయే ప్రధానమంత్రి”గా పేర్కొంటూ ఇలాంటి పోస్టర్‌లు వెలువడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా మరోసారి ఇలాంటివి జరగడం గమనార్హం.

ఇదిలా ఉంటే ఇటీవల యూపీలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం 80 స్థానాల్లో అఖిలేష్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ 37 స్థానాలను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇక బీజేపీ 33 స్థానాలు గెలుచుకుంది. అలాగే, కాంగ్రెస్ 6 స్థానాల్లో విజయం సాధించింది. అఖిలేష్ యాదవ్ ప్రస్తుతం యూపీలోని కన్నౌజ్ నుండి లోక్‌సభ ఎంపీగా ఉన్నారు.ఆయన గతంలో యూపీకి 20వ ముఖ్యమంత్రిగా పనిచేశాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version