ఏపీకి ప్రశాంత్‌ నీల్‌ భారీ విరాళం..? ప్రశంసలు కురిపించిన మాజీ మంత్రి !

-

‘కేజిఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ గొప్ప మనసు చాటుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ లోని సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలోని నీలకంఠాపురం లో ఎల్.వి ప్రసాద్ కంటి ఆసుపత్రి నిర్మాణానికి రూ.50 లక్షల విరాళం ప్రకటించారు. తండ్రి 75వ జయంతిని (ఆగస్టు 15) న పురస్కరించుకొని ప్రశాంత్ నీల్ ఈ భారీ విరాళాన్ని అందించారని మాజీ మంత్రి రఘువీరా రెడ్డి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

ఈ విషయాన్ని రఘువీరా రెడ్డి ఎందుకు ప్రకటించాల్సిన అవసరమేంటి అనుకుంటున్నారా? ఈ కేజిఎఫ్ డైరెక్టర్ ఎవరో కాదు, రఘువీరారెడ్డి సోదరుడు సుభాష్ రెడ్డి సొంత కుమారుడే. ప్రశాంత్ నీల్ పుట్టి పెరిగింది బెంగుళూరు లో అయినా, అతని సొంత గ్రామం మాత్రం అనంతపురం జిల్లా నీలకంఠాపురం. కొద్ది రోజుల క్రితమే ప్రశాంత్ నీల్ తండ్రి మరణించారు. నీలకంఠాపురం లోనే ఆయన అంత్యక్రియలు జరిగాయి. అందుకే ప్రశాంత్ నీల్ తరచూ ఈ గ్రామానికి వస్తుంటాడు. ఈ నేపథ్యంలోనే తండ్రి 75 వ జయంతిని (ఆగస్టు 15)న పురస్కరించుకొని ప్రశాంత్ నీల్ ఈ భారీ విరాళాన్ని అందించారట.

Read more RELATED
Recommended to you

Latest news