Breaking : హైదరాబాద్‌ కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

-

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అయితే.. ఆమెకు సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళి సై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బేగం పోర్ట్ ఎయిర్ పోర్టులో స్వాగతం పలికారు. ఇక, ఇవాళ రాత్రి రాజ్ భవన్‌లో బస చేయనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. రేపు ఉదయం 7.30 గంటలకు దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో జరిగే కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌లో పాల్గొనున్నారు.

అనంతరం రేపు ఉదయం 11 గంటలకు తిరిగి ఢిల్లీకి ప్రయాణం కానున్నారు. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో గవర్నమెంట్ వర్సెస్ గవర్నర్‌గా రాజకీయాలు నడుస్తుండటంతో.. గత కొంత కాలంగా గవర్నర్, సీఎం కేసీఆర్ ఎక్కడ ఎదురు పడలేదు. గవర్నర్ హాజరయ్యే మీటింగ్‌లకు సీఎం డుమ్మా కొట్టడం లేదా.. గవర్నర్‌ను ఈ కార్యక్రమాలకు ఆహ్వనించకపోవడం వంటివి జరుగుతోన్న క్రమంలో.. శుక్రవారం మాత్రం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు స్వాగతం పలికేందుకు కేసీఆర్, తమిళి సై హాజరవ్వడం విశేషం.

Read more RELATED
Recommended to you

Exit mobile version