విజయదశమి శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని మోడీ

-

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతిక విజయదశమి. దసరా పండుగ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలియజేశారు. పవిత్రమైన ఈ పండుగ ప్రతికూల శక్తులను అంతం చేయడంతో పాటు మనం జీవితంలో మంచిని అలవర్చుకోవాలనే సందేశాన్ని అందిస్తుందని ప్రధాని ట్విట్టర్ వేదికగా తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు రాష్ట్రపతి ద్రౌపతి మురుము దసరా పండుగ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

దేశ శ్రేయస్సుతోపాటు సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం కోసం ముఖ్యంగా అణగారిన వర్గాల సంక్షేమం కోసం కలిసి పని చేస్తామని అందరూ ప్రతిజ్ఞ చేయాలని కోరారు. దేశంలోని తూర్పు దక్షిణాది రాష్ట్రాల్లో మహిషాసురునిపై దుర్గాదేవి సాధించిన విజయానికి ప్రతి కదా దసరా పండుగ జరుపుకుంటున్నారని అన్నారు. దేశంలోని ఉత్తర పశ్చిమ రాష్ట్రాల్లో ఈ పండుగను రావణుడిపై శ్రీరాముడు సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకుంటారని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version