కాంగ్రెస్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన మోదీ

-

తాను పేదల సంక్షేమం కోసం, దేశ అభివృద్ధి కోసం ప్రయాసపడుతుంటే, కాంగ్రెస్​, ఇతర ప్రతిపక్ష పార్టీలు మాత్రం తన సమాధి కట్టడంలో నిమగ్నమయ్యారు అని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. తనకు రక్షణ కవచాలు ప్రజల ఆశీర్వాదాలే అన్నారు మోదీ. మైసూరు-బెంగళూరు మధ్య నిర్మించిన ఎక్స్​ప్రెస్​ వేను కర్ణాటకలోని మండ్యలో ప్రధాన మంత్రి ఆదివారం ప్రారంభించి, దేశానికి అంకితం చేశారు. అనంతరం జరిగిన సభలో ప్రసంగించిన మోదీ ఈ మేరకు వ్యాఖ్యలు చేపట్టారు.”దేశ అభివృద్ధి కోసం, ప్రజల జీవనం మెరుగుపడడం కోసం, మైసూరు-బెంగళూరు రహదారి కట్టడానికి డబుల్​ ఇంజిన్​ ప్రభుత్వం శతవిధాలా శ్రమిస్తోంది.

Congress dreaming of digging Modi's grave: PM at Bengaluru-Mysuru  Expressway inauguration - India Today

కాంగ్రెస్ ఇతర ప్రతిపక్ష పార్టీలు మాత్రం మోదీకి సమాధి కట్టాలని ​ కలలు కంటున్నాయి. నా సమాధి కట్టాలనుకునే కాంగ్రెస్​ నేతలకు తెలియదు, నాకు కోట్ల మంది ప్రజల ఆశీర్వాదముందని.నాకు రక్షణ కవచం ఆ ఆశీర్వాదమే. పేదలను ఇబ్బందులకు గురి చేసే వారిని నేను అస్సలు వదిలిపెట్టను.పేదల అభివృద్ధికి కావాల్సిన రూ.కోట్ల డబ్బును కాంగ్రెస్​ లూటీ చేసింది. మిమ్మల్ని కాపాడటానికి 2014 లో మీరు నాకు అవకాశమిచ్చారు. దానివల్లే మా ప్రభుత్వం ఏర్పడడం జరిగింది. ఈ ప్రభుత్వం పేదల బాధల్ని, ఇబ్బందులను అర్థం చేసుకుంటుంది. వాటి నుంచి విముక్తి పొందేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ.

 

Read more RELATED
Recommended to you

Latest news