BREAKING : ఈ నెల 23 నుంచి ప్రధాని మోడీ అమెరికా పర్యటన

-

దేశ ప్రధాని నరేంద్ర మోడీ… అగ్రరాజ్యం అమెరికా పర్యటన ఖరారైంది. ఈనెల 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు అమెరికా లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. ఈ అమెరికా పర్యటన సందర్భంగా… ఐక్య రాజ్యసమితి సర్వసభ్య సమావేశం లో ప్రసంగించనున్నారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ.

కరోనా మహమ్మారి మరియు తీవ్రవాదం ఇతర అంశాలపై ఐక్య రాజ్యసమితిలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించే అవకాశం ఉంది. అలాగే ఆఫ్ఘనిస్తాన్ దేశ రాజ్యాంగ సంక్షోభం మరియు ఆఫ్ఘనిస్తాన్ దేశ పరిస్థితులపై భారతదేశం వైఖరిని… ఐక్యరాజ్యసమితిలో ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం అందుతోంది. అంతేకాదు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి లో శాశ్వత సభ్యత్వం పై ప్రధాని మోడీ చర్చించే ఛాన్స్ కూడా ఉంది. ఆ తర్వాత ఈ నెల 23 లేదా 24వ తేదీన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ కానున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version